సమాజంలో మనవ మృగాలు ఎక్కువైతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి వరకు ఎవరికీ భద్రత లేకుండా పోతుంది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్న కానీ మృగాల అఘాయిత్యాలు మాత్రం పూర్తిగా ఆగడం లేదు. అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి పోవాలన్నా.. వారు, వారి కుటుంబం భయపడుతూ ఉండాల్సి వస్తోంది.
ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయ. అలాంటి ఘటన మరోటి జరిగింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద ఫార్మసీ విద్యార్థినిపై ఒక ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాలేజీ నుంచి ఫార్మ స్టూడెంట్ ఇంటికి వెళ్తుండగా ఆటో డైవర్ ఆమెను అపహరించి, ఈ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
తర్వాత దుస్తులు లేకుండా ఆ స్టూడెంట్ ను రహదారిపై వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత బాధితురాలిని మేడిపల్లిలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ఆ స్టూడెంట్ వాంగ్మూలాన్ని నమొదు చేసుకున్నారు. ఈ దారుణమైన ఘటనపై మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. ఈ దారుణానికి ఒడికట్టిన నిందితున్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాచకొండ సీపీని ఆదేశించారు.