తెలంగాణ ఎన్నికల వేళ చేరికలతో జోష్ మీదుంది కాంగ్రెస్. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కాంగ్రెస్ గూటికి చేరగా సినీ నటి విజయశాంతి సైతం హస్తం గూటికి చేరిపోయారు. ఇక పార్టీలో చేరిన వెంటనే ఆమెకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఇక తాజాగా మరో సీనియర్ నటి దివ్యవాణి కాంగ్రెస్లో చేరారు.ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
2019లో టీడీపీలో చేరిన దివ్యవాణి…ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకోగా 2022లో అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ను వీడారు. తాజాగా చాలా కాలం తర్వాత తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్ అయిన దివ్యవాణి కాంగ్రెస్లో చేరారు.
ఇక ప్రస్తుత ఎన్నికలు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. ప్రచారానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇరు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయగా గెలుపు ఎవరిదోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.