Thursday, May 2, 2024
- Advertisement -

మళ్లీ వైసీపీలోకి ఆళ్ల!

- Advertisement -

కాంగ్రెస్ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారా..?కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ తాడేపల్లి గూడెంలో సీఎం జగన్‌తో భేటీ కానున్నారు ఆళ్ల. అనంతరం వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలె కాంగ్రెస్ చీఫ్ షర్మిల సమక్షంలో హస్తం గూటికి చేరారు ఆళ్ల. వైసీపీ తరపున మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరగా అంత యాక్టివ్‌గా లేరు. ఇక రెండు రోజుల క్రితం ఎంపీ విజయసాయి, ఆర్కేతో చర్చించారు ఆళ్ల.

ఈ భేటీలో తిరిగి వైసీపీలో చేరేందుకు ఆళ్ల సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలో చేరిన తర్వాత రామకృష్ణారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. వరుసగా రెండుసార్లు వైసీపీ తరపున మంగళగిరి నుండి గెలుపొందారు ఆళ్ల. గత ఎన్నికల్లో నారా లోకేష్‌ని ఓడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -