- Advertisement -
నేటి నుండి ఏపీ సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సంగతి తెలిసిందే. ఇడుపులపాయ నుండి ఇఛ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇక తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు జగన్.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జగన్ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అనే పేరు పెట్టగా రాయుడు సైతం సిద్ధం అని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. దీంతో రాయుడు తిరిగి వైసీపీలో చేరుతారనే చర్చమొదలైంది.
గతేడాది డిసెంబర్ లో వైసీపీలో చేరిన రాయుడు జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధం అని పోస్ట్ చేయడంతో రాయుడు తిరిగి వైసీపీలోకి వస్తారా అన్న చర్చ జరుగుతోంది.
Sidham!!
— ATR (@RayuduAmbati) March 26, 2024