Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ కేబినెట్ భేటీ..సంచలన నిర్ణయాలు!

- Advertisement -

ఏపీ కేబినెట్ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులతో పాటు పలుశాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న కేబినెట్ సమావేశం కావడంతో సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 5 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉంది వైసీపీ సర్కార్. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల 12వ పీఆర్ సీని 2023 జులై 1వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండటంతో.. ఐఆర్ పై కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అలాగే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.

అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులను ఆమోదం తెలపనుంది. ప్రముఖంగా బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -