Tuesday, May 21, 2024
- Advertisement -

జైలు నుండే బాలయ్యను టార్గెట్ చేసిన బాబు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది వెన్నుపోటే. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారనే అపవాదు చంద్రబాబు,టీడీపీ ఉన్నంతకాలం ఉంటుంది. ఇక ఎన్టీఆర్..చంద్రబాబుపై చివరిసారిగా మాట్లాడిన వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఆ వీడియోలో చంద్రబాబు నిజస్వరూపాన్ని బయటపెడుతూ బండబూతులు తిట్టారు ఎన్టీఆర్. అయితే చంద్రబాబు తన రాజకీయ చతురతతో దానిని చెరిపేసే ప్రయత్నం చేసినా కొంతమంది టీడీపీ నేతలు ఇప్పటికి ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…మళ్లీ తనకు తెలిసిన విద్యను బయటకు తీశారట చంద్రబాబు. టీడీపీ చీఫ్ అరెస్ట్ తర్వాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బాబు రాజకీయ వారసుడు లోకేషే..కానీ ఆయన్ని కూడా అవినీతి కేసుల్లో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబు అరెస్ట్ అయిన తర్వాత అంతా తానై వ్యవహరించారు బాలయ్య. టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు కూర్చిలో కూర్చోవడమే కాదు పార్టీ నేతలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ములాఖత్ సందర్భంగా చంద్రబాబును కలిసి వైసీపీ సర్కార్‌పై తీవ్రంగా స్పందించారు. ఇక అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు బాలయ్య. మీసం మెలేయడం, తొడగొట్టడం,చంద్రబాబు కూర్చునే సీటెక్కి విజిల్స్ సైతం వేశారు.

దీంతో అంతా బాబు తర్వాత బాలయ్యే అనేలా పొలిటికల్ గేమ్ మారిపోయింది. దీంతో టీడీపీ అధినేత కన్నింగ్ పాలిటిక్స్ మొదలయ్యాయి. బాలయ్యకు వ్యతిరేకంగా బాబుతో పాటు కొంతమంది సీనియర్లు రంగంలోకి దిగారు.అంతే వెంటనే ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడును రంగంలోకి దించారు బాబు. ఇప్పుడు ఇదే టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అచ్చెన్న నేతృత్వంలో 14 మందితో పొలిటికల్ యాక్షన్ టీం ఏర్పాటుచేయగా అందులో బాలయ్యని జస్ట్ ఆరవ మెంబర్ గా ఉంచారు.

దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్‌ రగిలిపోయారు. బాబు తర్వాత బాలయ్యే అనుకుంటున్న తరుణంలో తమ నేతకు జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ సర్కార్‌పై బాలయ్య గట్టిగా పోరాడుతున్నారని కానీ పార్టీలోనే కొంతమంది ఆయనంటే గిట్టని వారు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో మళ్లీ బాబు వెన్నుపోటు రాజకీయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -