ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను ఫ్లాగ్ ఆఫ్ చేశారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్కు కఠిన హెచ్చరిక జారీ చేశారు.
పాకిస్తాన్లోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ పరిధిలో ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్లో సాధించిన విజయానికి అభినందిస్తూ, అది కేవలం “ట్రైలర్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ భారత సైన్యానికి ఒక గర్వకారణమని, ఇది భారత్ తన శత్రువులను ఎప్పుడూ విడిచిపెట్టదని నిరూపించిందని అన్నారు.ఆపరేషన్ సిందూర్ చూపించింది …విజయం ఇప్పుడు మనకు ఒక చిన్న విషయం కాదు, అది మన అలవాటు అయింది… మన శత్రువులు ఇక బ్రహ్మోస్ నుండి తప్పించుకోలేరని దేశం నమ్ముతోంది అన్నారు రాజ్నాథ్ సింగ్.
