Friday, May 3, 2024
- Advertisement -

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

- Advertisement -

తుది అంకానికి చేరిన వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో అబ్రహం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అబ్రహం. తొలుత అబ్రహంకే టికెట్ ప్రకటించినా బీ ఫామ్ వరకు వచ్చే సరికి చల్లా వెంకట్రామిరెడ్డికి వర్గానికి విజేయుడికి టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో అప్పటి నుండి అసంతృప్తిలో ఉన్న అబ్రహం ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు ఉన్న తరుణంఓ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్‌కు షాక్ తగిలినట్లైంది.

రీసెంట్‌గా జరిగిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఆలంపూర్ ప్రజా ఆశీర్వాద సభకు డుమ్మా కొట్టారు అబ్రహం. ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్ధి సంపత్ కుమార్‌కు మద్దతుగా హస్తం పార్టీలో చేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -