రెండోసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్. వైనాట్ 175 లక్ష్యంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తున్నారు జగన్. ఇక కొంతమందికి సీటు నిరాకరిస్తున్నారు కూడా. ఇప్పటివరకు ఆరు జాబితాల్లో సగం మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులను మార్చారు. ఇక త్వరలోనే ఏడో జాబితా కూడా రిలీజ్ కానుంది.
ఇక తాజాగా పలు జిల్లాలు, ఎంపీ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులయ్యారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి, కర్నూల్, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి.రామసుబ్బారెడ్డి నియమితులయ్యారు.
కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కే సురేశ్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్,విజయవాడ నగర అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.