Monday, May 20, 2024
- Advertisement -

చెవిరెడ్డి క్యాంటీన్లు @ ఒంగోలు

- Advertisement -

వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్నారు వైసీపీ చీఫ్ జగన్. ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చగా ఇందులో ఎంపీ అభ్యర్థులు కూడా ఉన్నారు.ఇక ప్రధానంగా ఒంగోలు విషయంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్లను పక్కనపెట్టారు జగన్‌.

ఎవరూ ఊహించని విధంగా ఒంగోలు నుండి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు.ఐదో జాబితాలో చెవిరెడ్డి పేరు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక బాలినేని మాత్రం మాగుంటకే తిరిగి సీటు ఇవ్వాలని కోరుతున్నా జగన్ మాత్రం మాగుంట విషయంలో ఏమాత్రం ఆసక్తికరంగా లేరు.

మరోవైపు చెవిరెడ్డి మాత్రం ఒంగోలు ఎంపీగా పోటీచేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ తన పేరును ప్రకటించగానే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చెవిరెడ్డి ఓ ప్రత్యేక టీమ్‌ను రెడీ చేయగా వీరంతా సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌తో పాటు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు. ఇక ఒంగోలు వ్యాప్తంగా చెవిరెడ్డి క్యాంటీన్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, భోజనం, స్నాక్స్, డిన్నర్ ఇలా ఉదయం నుండి రాత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెవిరెడ్డి క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి చెవిరెడ్డి పేరు ఫైనల్ అయితే ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -