Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు..

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అయితే తెలంగాణ రాజకీయాల్లో ఆ పాత్ర పోషించేది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తరపున సీఎంగా ఎన్నికైనా ఇప్పటికి చంద్రబాబును ఒక్క మాట అనరు రేవంత్. అంతేగాదు బాబే తన గురువు అని చెప్పుకోవడంలో సందేహించరు. అలాంటి రేవంత్ తొలిసారి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.

విశాఖలో కాంగ్రెస్ సభలో మాట్లాడిన రేవంత్..టీడీపీ కూటమి గెలిస్తే మోడీ పక్కనే చేరుతుందని విమర్శించారు. చంద్రబాబు, పవన్ వెన్నెముక లేని నాయకులని..మోడీని నిలదీసే ధైర్యం చేయలేరన్నారు. వెన్నెముకలేని నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించలేరని తెలిపారు.

ప్రశ్నించే వారు లేకపోవడం వల్లే ప్రధానమంత్రి మోడీ తన ప్రతాపం చూపిస్తున్నారన్నారు. తెలుగు గడ్డపై నుండి నీలం సంజీవరావు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, జైపాల్ రెడ్డి, వైఎస్సార్ లాంటి వారు ప్రజల ఆకాంక్షలు తీర్చారని చెప్పారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకి మొదటి పునాదిరాయి రాజశేఖర్ రెడ్డి వల్లే పడిందన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -