Thursday, May 16, 2024
- Advertisement -

శ్రీకాకుళం టీడీపీలో ముసలం..బాబుకు మరో షాక్!

- Advertisement -

ఏపీ టీడీపీలో వివాదాలు రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఓవైపు పొత్తులో సీట్లు కొల్పోతున్న నేతలను బుజ్జగించడం టీడీపీ అధినేత చంద్రబాబుకు కత్తి మీద సాముగా మారగా మరోవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు కొత్త చిక్కులను తెచ్చి పెడుతున్నాయి.

ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమా వర్సెస్ వంగవీటి రాధాకృష్ణ మధ్య వివాదం నడుస్తుండగా తాజాగా శ్రీకాకులం నియోజకవర్గంలో విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్సెస్ గోండు శంకర్ మధ్య అసంతృప్తి రాజుకుంది.

ఇంటింటికి శంకరన్న కార్యక్రమాన్ని శంకర్ ప్రారంభించగా దీనిని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, పట్టణ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పట్టణ టీడీపీకి సమాచారం లేకుండా పార్టీ కార్యక్రమం ఏంటంటూ శంకర్‌ని నిలదీశారు టీడీపీ నేతలు. సొంత పార్టీ కార్యక్రమం ఏదైనా ఉంటే పార్టీ జెండా లేకుండా చేయాలంటూ గొడవకు దిగారు. దీంతో శంకర్‌ వెనుదిరుగగా దీని వెనుక లక్ష్మీదేవి ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఓ వైపు పొత్తలో విభేదాలు మరోవైపు నేతల మధ్య కుదరని సయోధ్య వెరసీ చంద్రబాబుకు రోజుకో తలనొప్పి కొత్త సమస్యను తీసుకొచ్చి పెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -