Thursday, May 2, 2024
- Advertisement -

అఖిల ప్రియకు షాక్ తప్పదా?

- Advertisement -

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ. ఈ నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది భూమా నాగిరెడ్డి – శోభా. వీరిద్దరూ బ్రతికున్న రోజుల్లో ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలో చెప్పిందే వేదం. ఆ తర్వాత వీరి వారసురాలిగా వచ్చిన అఖిల ప్రియ ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు.

కానీ 2019లో జగన్ సునామీలో భూమా ఫ్యామిలీ హవా పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నేతల నుండి పోరు ఒకవైపు అయితే సొంత ఇంటి నుంచే వ్యతిరేకత రావడం మొదలైంది. అఖిలప్రియ పెద నాన్న కుమారుడు, ఆళ్లగడ్డ బీజేపీ ఇంచార్జి భూమా కిశోర్‌ రెడ్డి, అఖిలప్రియ మేనత్త శ్రీదేవి..ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పారు.

వచ్చే ఎన్నికల్లో భూమా కుటుంబం అంతా కిషోర్‌ రెడ్డికే మద్దతు ఇస్తుందని వెల్లడించారు శ్రీదేవి. అఖిలప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని…వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా కుటుంబం తరఫున ఎమ్మెల్యేగా బరిలో ఉండేది తానేనని భూమా కిశోర్‌ రెడ్డి కూడాతేల్చి చెప్పడంతో అఖిల ప్రియకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం తనకు సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌ గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఈసారి అఖిల ప్రియకు ఎదురుదెబ్బ తగిలడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -