మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంచలన కామెంట్స్ చేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సంస్థాగత నిర్మాణ లోపం వల్లే అసెంబ్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని తెలిపారు. అలాగే కేసీఆర్ దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని…కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు.
తనకే ఎన్నికలకు ముందు 6 నెలల అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు. తన కొడుకు అమిత్కు టికెట్ అడిగిన మాట వాస్తవమే కానీ ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల సహకారం సరిగా లేదు. మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర నేతలకు ఇంటికి భోజనానికి వస్తే జిల్లా నేతలు మొహం చాటేశారన్నారు.
స్వయంకృషితోనే నాకు పదవి వచ్చిందని, ఎవరో పెట్టిన భిక్ష కాదని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్యేల అహంకారం కొంపముంచిందని…తాను ఎంపీ అయిన నాడు జగదీశ్ రెడ్డి లాగులు కట్టుకొని తిరుగుతుండే. ఇవ్వాళ నా మీద మాట్లాడుతుండని చురకలు అంటించారు. నేతలంతా పార్టీ మారుతుంటే వారిని నమ్ముకుని ఎలా పోటీ చేస్తామన్నారు.