- Advertisement -

శాంసన్‌ రాక..సీఎస్‌కేకు బోనస్!

- Advertisement -

ఈసారి ఐపీఎల్ 2026 ఆసక్తికరంగా సాగనుంది. ముఖ్యంగా సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనుండగా మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాజస్థాన్ రాయల్స్ పై ఆడే మ్యాచ్‌లో అతని ఉనికి జట్టుకు పెద్ద ప్రయోజనంగా మారుతుందని చెప్పారు. సంజూ శాంసన్… చాలా కాలం రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ఉండటంతో ఆ జట్టు వ్యూహాలు, ఆటగాళ్ల బలాబలాలు అతనికి బాగా తెలుసని తెలిపారు. అందువల్ల రాజస్థాన్ జట్టు పవర్‌ప్లేలో ఎలా ఆడుతుందో, మధ్య ఓవర్లలో వారి వ్యూహం ఏమిటో, బౌలర్ల దాడి ఎలా ఉంటుందో వంటి విషయాలపై చెన్నై జట్టుకు లోతైన సమాచారం ఇవ్వగలడని అన్నారు.

రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న చాలా మంది యువ ఆటగాళ్లు సంజూ నాయకత్వంలో ఆడినవారేనని కూడా ఆయన గుర్తుచేశారు. అందువల్ల వారి మైండ్‌సెట్ ఎలా ఉంటుందో, ఒత్తిడి సమయంలో వారు ఎలా స్పందిస్తారో కూడా సంజూకు తెలుసని చెప్పారు. ఈ కారణాల వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ శాంసన్ పెద్ద ఆస్తిగా మారతాడని పఠాన్ అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, టీ20 ప్రపంచకప్‌లో చూపించిన ఫామ్ కూడా సంజూకు అదనపు ధైర్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే గువాహటి మైదాన పరిస్థితులపై కూడా సంజూకు అనుభవం ఉండటంతో మొదటి మ్యాచ్‌లో అది ఉపయోగపడుతుందని చెప్పారు. మొత్తంగా చూస్తే, సంజూ శాంసన్ అనుభవం, వ్యూహాత్మక అవగాహన, మరియు ఇటీవల చూపించిన ఫామ్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో బలమైన జట్టుగా మారే అవకాశం ఉందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -