ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మధ్యంతర బెయిల్పై ఉన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఇక మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు కండీషన్స్తో కూడిన బెయిల్ ఇవ్వగా ఇందులో పొలిటికల్ మీటింగ్స్లో పాల్గొనవద్దని న్యాయస్థానం స్పష్టంగా తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 9న జరిగే టీడీపీ – జనసేన కో ఆర్డినేషన్ మీటింగ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా లేదా అన్నది సందిగ్దం నెలకొంది. తొలి మీటింగ్ రాజమండ్రిలో ఓ హోటల్లో జరుగగా రెండో మీటింగ్ టీడీపీ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగుకు టీడీపీ జనసేనల వైపు నుంచి చెరి ఆరుగురు సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫేస్టోపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ చంద్రబాబు ఈ మీటింగుకు వస్తు కోర్టు షరతులు ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇక బాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో 8న తీర్పు రానుంది. ఒకవేళ బాబుకు అనుకూలంగా తీర్పు వస్తే పూర్తిస్ధాయి రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే ఇరు పార్టీల కో ఆర్డినేషన్ మీటింగ్కు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే వర్చువల్గా నేతలతో మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.