Tuesday, April 30, 2024
- Advertisement -

రికార్డు బ్రేక్ సరే…ఏమైనా ఉపయోగం ఉందా!

- Advertisement -

చంద్రబాబు మీకోసం పాదయాత్ర రికార్డును బ్రేక్ చేశారు నారా లోకేష్. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన యాత్ర 2817 కిలో మీటర్లకు చేరుకుంది. దాదాపు 206 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు లోకేష్. మరో 90 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువగళంకు ముగింపు పలకనున్నారు.

ఇక ఈ పాదయాత్రతో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేశారు లోకేష్. 2012లో చంద్రబాబు మీకోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన 208 రోజుల్లో 2817 కిలోమీటర్ల మేర నడవగా అది 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అయితే ఇదే బాటలోనే నారా లోకేష్ సైతం నడుస్తున్నారు. అయితే పాదయాత్ర 200 రోజులు అయితే దాటింది. అలాగే చంద్రబాబు రికార్డునైతే బ్రేక్ చేసింది కానీ ప్రజల్లో ఏమైనా ప్రభావం చూపిందా అంటే సందేహామే.

ఎందుకంటే నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దేశంలో ఓ రాజకీయనాయకుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అంటే గుర్తుకొచ్చేది లోకేషే. ఎందుకంటే ఆయన మాటతీరే అంతా. ఒక్కోసారి లోకేష్ ఏం మాట్లాడుతున్నారో జనాలకే కాదు ఆయన పక్కన ఉన్నవాళ్లకు చివరికి ఆయనకు అర్ధం కాని పరిస్థితి. అందుకే లోకేష్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ యాక్టివ్‌ అయింది..పాజిటివ్ కోణంలో మాత్రం కాదు.

ఇక లోకేష్ ఏం మాట్లాడిన సంచలనమే. అందుకే ఆయన పాదయాత్రలో ప్రతిరోజు మాట్లాడిన మాటలపై మీమ్స్‌ వినని వారుండరు. దీనికి తోడు రెడ్ బుక్. ఏ నియోజకవర్గానికి వెళ్లిన అక్కడ ప్రత్యర్థి నేతల పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నానని అధికారంలోకి వచ్చాక వారి సంగతి చెబుతాననడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే అధికారులకు ఇదే వార్నింగ్. దీంతో లోకేష్ అంటే ఓ కామెడీ అనేలా జనంలో పాతుకుపోయింది. ఈ నేపథ్యంలో లోకేష్ 4 వేలు కాదు ఇంకా 40 వేలు నడిచినా టీడీపీకి ఏం ప్రయోజనం లేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -