ఏపీలో టీడీపీకి కొత్త వ్యూహకర్త రానున్నారా..?అధికారంలోకి రావడానికి చంద్రబాబు..పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ని సంప్రదించారా..?అంటే టీడీపీ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఇంఛార్జీలను నియమిస్తూ వస్తున్నారు బాబు. దీని వెనుక మాస్టర్ మైండ్ ప్రశాంత్ కిషోర్ ఉన్నారని తెలుస్తోంది.
ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలో ప్రశాంత్తో పలు అంశాలపై లోకేష్ చర్చించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పీకే టీమ్ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారని..ఆ నిర్ణయాలే ఇప్పుడు బాబు కొత్త ఇంఛార్జీలను నియమించారని ప్రచారం జరుగుతోంది.
అయితే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు పీకే. జగన్ గెలుపులో కీ రోల్ పోషించారు. జగన్తో పీకేకు ఇప్పటికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేకంగా పీకే టీం నిజంగానే టీడీపీకి పనిచేస్తుందా లేదా అన్నది త్వరలోనే క్లారిటీకి రానుంది.