అనకాపల్లిలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్ల మీదకు వచ్చి మాజీ సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు వైసీపీ కార్యకర్తలు. భారీ వర్షంలోనూ నర్సీపట్నం పర్యటనని కొనసాగించారు జగన్. తాళ్ళపాలెం జంక్షన్ చేరుకున్న జగన్కు అడుగడుగునా స్వాగం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభివాదం చేశారు జగన్.
ఇక అంతకముందు విశాఖ ఉక్కు ప్లాంట్ (వీఎస్పీ) ఉద్యోగులకు హామీ ఇస్తూ, ఆ ప్లాంట్ రక్షణ ఎప్పటి నుంచీ తన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు జగన్. నర్సీపట్నం మరియు విశాఖపట్నం పర్యటనలో ఉద్యోగులు తనను కలిసి వినతిపత్రం సమర్పించగా, జగన్ మరోసారి ఉక్కు ప్లాంట్ రక్షణపై తన కట్టుబాటును పునరుద్ఘాటించారు.
ఉక్కు ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల హామీ ఇచ్చిన టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమను మోసం చేసిందని. ప్లాంట్ను నిలబెట్టేందుకు జగన్ మద్దతు ఇవ్వాలని వారు కోరారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన జగన్..అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉక్కు ప్లాంట్ రక్షణ కోసం ఎల్లప్పుడూ పోరాడుతుంది అని హామీ ఇచ్చారు. ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం మరియు కార్మికుల పోరాటానికి అండగా నిలబడటం వైఎస్ఆర్సీపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
