ఏపీ రాజకీయాల్లో కామెడీ స్టార్గా మారిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏదో ఉద్దరిస్తానని రాజకీయాల్లోకి వచ్చారు పవన్. అధికారంలో వాటా మాకే… సీట్లు మాకే… అంటూ బీరాలు పలికిన జనసేనాని రోజురోజుకు దిగజారిపోతున్నారు. ఓ దశలో రాష్ట్రాన్ని పాలిస్తాను, సీఎం అవుతానని పదేపదే చెప్పి ఇప్పుడు మాత్రం చిక్కిపోయారు.
టీడీపీతో పొత్తులో 24 సీట్లు జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినప్పుడే పవన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏకంగా కొంతమంది నేతలు పార్టీని వీడగా కాపు సంఘం నేతలైతే పవన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేనాని వైఖరికి నిరసనగా పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఇక ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తులో బీజేపీ చేరగా మరిన్ని స్థానాలను త్యాగం చేశారు పవన్. ఇప్పుడు జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య 21కి చేరగా మూడు ఎంపీ సీట్లను సైతం రెండుకి తగ్గించేశారు. అయితే అభ్యర్థుల ప్రకటన వరకు ఆ 21 సీట్లు అయినా ఉంటాయా అని పవన్పై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. మేమేం రాజకీయం చేస్తాం… అటు బిజెపికి.. టీడీపీకి ఊడిగం చేయడమే మా పని అని పరోక్షంగా పవన్ని ఉద్దేశించి కౌంటర్ వేస్తున్నారు.