Sunday, April 28, 2024
- Advertisement -

ఆ టీడీపీ నేత సీటుపై కన్నేసిన జేసీ బ్రదర్స్‌!

- Advertisement -

జేసీ బ్రదర్స్‌..ఒకప్పుడు అనంతపురం రాజకీయాలను శాసించారు. కాంగ్రెస్ పార్టీ నుండి దశాబ్దాల కాలం పాటు ప్రజా ప్రతినిధులుగా పనిచేశారు. జేసి ప్రభాకర్ రెడ్డి మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ఇక ఆయన తమ్ముడు ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉండగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

అయితే ఇదంతా గతం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వైసీపీ సర్కార్ వచ్చి, జగన్ గాలిలో జేసీ బ్రదర్స్ సునామీలా కొట్టుకుపోయారు. వీరి రాజకీయ పలుకుబడి తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. జేసీ బ్రదర్స్‌ అంటేనే ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి అర్ధం కాదు. టీడీపీ అగ్రనేత చంద్రబాబుకు సన్నిహితంగానే ఉంటారు కానీ ఆయన అరెస్ట్ తర్వాత స్పందించింది లేదు. కనీసం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కష్టకాలంలో ఉంటే పార్టీని పట్టించుకోని ఈ జేసీ బ్రదర్స్‌ …అప్పుడే ఎన్నికల రంగంలోకి దిగిపోయారు.

వీరిద్దరి కన్ను పుట్టపర్తిపై పడింది. ఇక్కడి నుండి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ ఇంఛార్జీగా ఉన్నా ఈసారి పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాకర్ రెడ్డి. అన్న అండతో పుట్టపర్తిలో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఆయన ఫ్లెక్సీలు పుట్టపర్తిలో దర్శనమివ్వడం. దీంతో రఘునాథ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గ‌తంలోనూ పుట్ట‌ప‌ర్తిలో వేలు పెట్టేందుకు ప్రయత్నించారు ప్రభాకర్ రెడ్డి. కానీ అప్పుడు లోకేష్ జోక్యంతో వెనక్కి తగ్గగా ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. వయసు మీద పడుతున్న పోటీకి జేసీ ప్రభాకర్ రెడ్డి తహతహలాడుతుండటం మాత్రం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -