- Advertisement -
వాలంటీర్పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సహకరించలేదని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డారని తెలుస్తుది. ఇళ్ళు కూల్చేస్తానంటూ వాలంటీర్ కు జేసీ ప్రభాకర్ బెదిరింపులకు పాల్పపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హరికుమార్ ఇంట్లో ఉన్న మోటారు పంపుసెట్ తీసుకోవాలని జేసీ ఆదేశాలు చేశారని.. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్ లాక్కు వెళ్లారని.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు.