Saturday, April 27, 2024
- Advertisement -

సర్వేలన్ని వైసీపీ వైపే..ఇక టీడీపీ ఖతమే!

- Advertisement -

ఏపీలో ఏ సర్వే చూసినా వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి.ఇక ఎన్నికల రేసులో అధికార వైసీపీ ఒకడుగు ముందంజలో ఉండగా టీడీపీ మాత్రం జనసేనతో పొత్తులో వెనుకబడే పోయింది.టీడీపీ – జనసేన నుండి రెండు పార్టీల నేతుల ఒకే నియోజకవర్గంలో సీటు కోసం పోట్లాడుకునే పరిస్థితి నెలకొంది. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం తన నిర్ణయాలు తాను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

పారదర్శక పాలన, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో తమకే పట్టం కట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు వైసీపీ నేతలు. ఇప్పటివరకు వెలువడించిన సర్వేలు వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పాయి. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కొన్ని స్థానాలు తగ్గినా గెలుపు వైసీపీదే అని తెలిపాయి.

తాజాగా న్యూస్ ఏరినా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనపించింది. 122 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పగా జనసేన – టీడీపీ కూటమి కేవలం 55 స్థానాలకే పరిమితం అవుతుందని వెల్లడించింది. ఇక కాంగ్రెస్, బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని తెలిపింది. సర్వేలన్ని వైసీపీ వైపే ఉండటంతో ఆ పార్టీ నేతల ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -