Thursday, May 23, 2024
- Advertisement -

కారెక్కనున్న నాగం..!

- Advertisement -

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌ ప్రకటించిన తర్వాత అసంతృప్తి తారాస్ధాయికి చేరుకుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతో హస్తం పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే జిట్టా,చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి,సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి లాంటి నేతలు హస్తాన్ని వీడి కారెక్కగా ఇదే బాటలో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఉన్నారు.

నాగర్ కర్నూల్ టికెట్ ఆశీంచారు నాగం. అయితే ఆయనకు మొండిచేయి చూపింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన కాంగ్రెస్‌ను వీడి కారెక్కెందుకు సిద్ధమయ్యారు. నాగం బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ అసంతృప్త నేతలను అక్కున చేర్చుకునేందుకు మంత్రి కేటీఆర్,హరీష్ రావు పావులు కదుపుతున్నారు. ఇక ఇదే బాటలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -