Wednesday, May 8, 2024
- Advertisement -

షర్మిల ఎపిసోడ్..అంతా చంద్రబాబు కుట్రే!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఎపిసోడ్ మొత్తం వెనకుంది చంద్రబాబేనని..రాజకీయంగా షర్మిల ఎక్కడి నుండైనా ప్రాతినిధ్యం వహించవచ్చని దీనివల్ల వైసీపీకి వచ్చే నష్టం లేదన్నారు. ఏపీలో అసలు భవిష్యతే లేని పార్టీ గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొటిపారేశారు.

జగన్‌పై ఆది నుండి కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగానే వ్యవహరిస్తుందని దీనికి చంద్రబాబు తోడయ్యారన్నారు. వైఎస్ మరణం పట్ల కాంగ్రెస్ పై అనుమానాలు మండిపడ్డారు. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ వివేకాను జగన్‌కు వ్యతిరేకంగా బరిలోకి నిలిపిందని, ఇప్పుడు చంద్రబాబుతో కలిసి తెరవెనుక రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికి అర్ధం అవుతుందన్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని..అలాంటి పార్టీ గురించి ఎలాంటి తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. షర్మిలతో వైసీపీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారని వాటిని ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. ఏదో ఒకరకంగా జగన్ ను దించాలనేది చంద్రబాబు కుట్ర అని దానిని తప్పకుండా తిప్పికొడతామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -