Monday, April 29, 2024
- Advertisement -

కడప నుండే షర్మిల బస్సు యాత్ర..

- Advertisement -

ఎన్నికల రణక్షేత్రంలో ఇప్పటికే వైసీపీ దూసుకుపోతుండగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బస్సుయాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది. ఇప్పటికే 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. షర్మిల కడప ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

తొలి జాబితా రిలీజ్ కావడంతో బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు షర్మిల. ఏప్రిల్ 5 నుండి కడప జిల్లాలో ఎనిమిదిరోజుల పాటు బస్సు యాత్ర జరగనుంది. కడపలోని అన్ని మండలాల్లో ఈ బస్సు యాత్ర ఉండనుంది.

5వ తేదీన కాశీనాయన,కలసపాడు,పొరుమామిళ్ల,బి.కోడూరు,గోపవరం మండలాల్లో షర్మిల ప్రచారం జరగనుంది. 6వ తేదీన బద్వేల్,అట్లూరు,కడప,7వ తేదీన దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదకూరు, బి.మఠంలో,8వ తేదీన కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి,వీరపునాయిని పల్లిలో బస్సు యాత్ర ఉండనుంది.

10వ తేదీన చక్రాయపేట,వేంపల్లి,వేముల,పులివెందుల,సింహాద్రిపురం, లింగాలలో 11వ తేదీన తొండూరు,ఎర్రగుంట్ల,కొండాపురం,ముద్దనూరు,మైలవరం,12వ తేదీన జమ్మలమడుగు, పెద్దముడియం,ప్రొద్దుటూరు,రాజుపాలెంలో యాత్ర జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -