Sunday, May 19, 2024
- Advertisement -

పాలేరు బరిలో షర్మిల..6న నామినేషన్

- Advertisement -

ఈ నెల 3 నుండి తెలంగాణలో నామినేషన్ల పర్వం మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించిన అనుకున్న విధంగానే పాలేరు నుండి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6న నామినేషన్ దాఖలు చేయనున్నారు. తనతో పాటు ఎంతమంది పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.

అయితే త్వరలోనే ఎంతమంది పోటీ చేస్తారనే దానిపై వివరాలు వెల్లడించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలకు షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఇక రేపటి నుండి పాలేరులో ప్రచారం నిర్వహిస్తున్నారు షర్మిల. అయితే ఎప్పుడు లిస్ట్ ప్రకటిస్తారు, పోటీ చేసేది ఎంతమంది అనేది రెండు మూడు రోజుల్లోనే అనౌన్స్ చేయనున్నారు.

పాలేరు పోరు ఈ సారి రసవత్తరంగా ఉండనుంది. అధికార బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుండి ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా వైసీపీ నుండి షర్మిల పోటీ కన్ఫామ్ అయిపోయింది. ఇక ఇవాళ ఖమ్మం సభలో పొంగులేటినే సీఎం కేసీఆర్ టార్గెట్ చేయడంతో పాలేరు రేసులో గెలిచేది ఎవరనేది ఉత్కంఠ కలిగించే అంశమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -