Saturday, April 27, 2024
- Advertisement -

బాబుకు షాక్..రెబల్ అభ్యర్థిగా బొడే ప్రసాద్

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింది. పెనమలూరు టికెట్ ఆశీంచి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పటికే అనుచరులతో సమావేశం నిర్వహించారు. అయితే చంద్రబాబు నుండి పిలుపురావడంతో వెళ్లగా సీటు ఇచ్చేది లేదని చెప్పేశారు. దీంతో బాబుకు ఎదురుతిరిగారు బోడే ప్రసాద్.

రెబల్ అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి చంద్రబాబు అన్యాయం చేశాడని ప్రచారం చేస్తున్నారు. బోడే ప్రసాద్ చర్యలతో పెనమలూరు పై అయోమయంలో పడ్డారు బాబు. ఇక పెనమలూరు రేస్ నుండి దేవినేని ఉమని పక్కన పెడుతూ ఆలపాటి రాజా, దేవినేని అపర్ణ పేర్ల పై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ముస్లిం అభ్యర్థి కోసం సర్వే చేశారు. అయితే తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని లేకుంటే తిరుగుబాటు తప్పదని తెగేసి చెబుతున్నారు ప్రసాద్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -