- Advertisement -
టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇవాళ పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో సెకండ్ లిస్ట్పై చర్చించారు. ఇక బీజేపీతో పొత్తు నేపథ్యంలో త్వరలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, పవన్ అక్కడ బీజేపీ పెద్దలను కలిసి ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇక ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్పై ప్రకటన చేయనున్నారు. ఇక రెండో జాబితాలో టీడీపీ నుండి 25, జనసేన నుండి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఇప్పటికే ఫస్ట్ లిస్ట్లో అసంతృప్తులను బుజ్జగించడం రెండు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికి అసంతృప్తులు చంద్రబాబు, పవన్లపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. ఇక సెకండ్ లిస్ట్ తర్వాత ఈ అసంతృప్తి మరింత రాజుకునే అవకాశం ఉంది.