Saturday, April 27, 2024
- Advertisement -

తెలంగాణ ఎంపీ అభ్యర్థులు ఫైనల్‌!

- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ 15,బీజేపీ 15,కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఈ మూడు పార్టీలు మిగితా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక పూర్తిచేయగా ప్రకటనే తరువాయి.

బీజేపీ మిగిలిన రెండు స్థానాలకు వరంగల్ – ఆరూరి రమేష్‌, ఖమ్మం – జలగం వెంకట్రావ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరితే ఆయనకు ఖమ్మం సీటు ఇస్తారని ప్రచారం జరిగిన అవన్ని పుకార్లేనని తేలిపోయాయి.

ఇక అధికార కాంగ్రెస్ మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మెదక్ – నీలం మధు, హైదరాబాద్ – షహనాజ్ తుబ్బం,ఆదిలాబాద్ – ఆత్రం సుగుణ
,కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి,భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి,వరంగల్ – పసునూరి దయాకర్,ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి,నిజామాబాద్ – జీవన్ రెడ్డిలకు టికెట్ కేటాయించినట్లు సమాచారం.ఇక బీఆర్ఎస్ భువనగిరి – బూడిద భిక్షమయ్య గౌడ్,నల్గొండ – తేరా చిన్నపురెడ్డి,సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్‌లకు టికెట్ కేటాయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -