Monday, April 29, 2024
- Advertisement -

అనంతలో టీడీపీకి షాక్..వైసీపీలోకి కీలకనేత!

- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత,ఉమా మహేశ్వర్ నాయుడు వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. వైసీపీ నేతలు తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉమామహేశ్వర్‌ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

పార్టీ జెండా కూడా ముట్టుకోని వ్యక్తికి టీడీపీ టికెట్ ఇచ్చి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఉమామహేశ్వర్ రెడ్డి. నాకు జరిగిన అన్యాయాన్ని అధికార పార్టీ గుర్తించింది… నా సేవలు ఆ పార్టీకి కావాలని సీఎం జగన్‌ ద్వారా సమాచారం అందింది..కార్యకర్తలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉన్న నాయకుడిగా కార్యకర్తగా పనిచేశాను..కానీ చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారన్నారు. ఉమామహేశ్వరరావు టీడీపీని వీడితే ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే.

2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోటీచేశారు మాదినేని ఉమామహేశ్వర నాయుడు. తన సమీప ప్రత్యర్థి వైకాపా నేత మంత్రి ఉషశ్రీ చరణ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తాజాగా సురేంద్రబాబు అనే కొత్తవ్యక్తికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు ఉమామహేశ్వరనాయుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -