Tuesday, April 30, 2024
- Advertisement -

పాలకొల్లు..టీడీపీకి చెక్ పడేనా?

- Advertisement -

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆ నియోజకవర్గం ఎంతో ప్రత్యేకం. విలక్షణ తీర్పులకు కేరాఫ్. మెగాస్టార్ చిరంజీవి,దాసరి నారాయణరావు ఆ నియోజకవర్గానికి చెందిన వారే. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి అడ్డాగా ఉన్న ఆ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు టీడీపీ జెండానే ఎగిరింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటనుకుంటున్నారా?. అదే పాలకొల్లు.

2014,2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయాడు గెలుపొందారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రామానాయుడు భావిస్తుండగా ఆయనను కట్టడి చేసి వైసీపీ జెండగా ఎగరవేయాలని భావిస్తున్నారు గుడాల గోపి.

2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి తన స్వస్థలం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనం కాగా ఇక వైసీపీ హవాలోనూ గెలుపొందారు రామానాయుడు. పాలకొల్లులో మొత్తం లక్షా 90 వేల ఓట్లు ఉండగా కాపు సామాజికవర్గం ఓట్లు 52 వేలు ఉండగా. పాలకొల్లు ఇంఛార్జీగా ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్‌ను కాదని గోపికి టికెట్ ఇచ్చారు జగన్. అంతేగాదు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబులను గోపి విజయం కోసం పనిచేయాలని ఆదేశించారు జగన్. మొత్తంగా పాలకొల్లు పోటీ ఆసక్తికరంగా మారగా విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -