- Advertisement -
రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సుయాత్ర మూడో రోజు ఎమ్మిగనూర్,పెంచికలపాడు రోడ్ షోలో మాట్లాడిన జగన్…లారీ డ్రైవర్కు టికెట్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు హేళన చేశారని జగన్ చెప్పారు.
ప్రజా వ్యతిరేక పార్టీలకు సమాధి కట్టాలని…బాబు తోకను, తోకలను కత్తిరించాలని చురకలు అంటించారు. పేదల సంక్షేమం కోసం వైసీపీని గెలిపించాలని …ఈ ఐదేళ్లు పేదలకు మంచి జరిగిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారని అన్నారు.
ఈ ఎన్నికలే మీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి…పొరపాటు అస్సలు చేయవద్దన్నారు. అక్కాచెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయని చెప్పారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీదేనని …పొత్తులను, జిత్తులను ఎదుర్కుంటానని తెలిపారు.