- Advertisement -
ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 27 నుండి జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని దీనికి మేమంతా సిద్ధం అనే పేరు ఖరారు చేశామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన… 28న నంద్యాలలో , 30న ఎమ్మిగనూరులో బస్సు యాత్ర, బహిరంగ సభలు ఉంటాయని వివరించారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బస్సు యాత్ర కొనసాగుతుందని…నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని వెల్లడించారు. 27 నుండి జగన్ పూర్తిగా యాత్రలోనే ఉంటారని సెలవుల్లో కూడా యాత్ర జరుగుతుందన్నారు.
ఇక ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుందని, అలాగే పార్టీ నేతలతో సమావేశాలుంటాయని తెలిపారు. 30వ తేది మూడవ రోజు కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎమ్మిగనూరులో సభ ఉంటుందని తెలిపారు సజ్జల.