Tuesday, May 7, 2024
- Advertisement -

షర్మిల దూకుడు..జిల్లాల పర్యటన షురూ!

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఓ వైపు పార్టీలో చేరికలపై దృష్టి సారిస్తూనే మరోవైపు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుండి ఈనెల 31వ తేదీ వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు షర్మిల. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి షర్మిల టూర్ ప్రారంభం కానుండగా ఇడుపులపాయలో ముగియనుంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో న్కాకంభమై, మధ్యాహ్నం పార్వతీపురంలో పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి విజయనగరం చేరుకుని అక్కడ పార్టీ పరిస్థితిని నేతల నుండి అడిగి తెలుసుకోనున్నారు. రోజుకు నాలుగు జిల్లాల చొప్పున షర్మిల టూర్ ఉండేలా షెడ్యూల్ ఖరారు చేశారు.

24న విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాలపల్లిలో ,25న కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో, 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, 28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో షర్మిల టూర్ సాగనుంది. ఇక 30న శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో, ఈనెల 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది. ఇక షర్మిల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -