Monday, May 20, 2024
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలోకి సునీతా రెడ్డి..!

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియమితులైన సంగతి తెలిసిందే. ఇక షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వలసలుంటాయని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తొలి అడుగు వైఎస్ కుటుంబం నుండే పడింది. దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.

త్వరలోనే సునీత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామమే అవుతుంది. అలాగే ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నవారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మరోవైపు అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున సిట్టింగ్‌ల మార్పు చేపట్టడంతో పాటు అసంతృప్తులను బుజ్జగించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. త్వరలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలను మార్చే అవకావం ఉండగా నాలుగో జాబితాపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -