‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మే 4వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత తన తర్వాతి సినిమాను కూడా అర్జున్ సిద్ధం చేసేసుకున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ వేసేసుకుంటున్నాడు. ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది.
కమర్షియల్ విజయాలు లేకపోయినా అభిరుచి ఉన్న దర్శకుడిగా క్ష్ పేరు పొందాడు. ఆయన దర్శకత్వంలో బన్నీ తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడని తెలుస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో ‘వేదం’ సినిమాలో నటించిన బన్నీకి నటుడిగా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో ఫుల్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు అర్జున్తో ఫుల్ పాత్రలో క్రిష్ సినిమా చేయాలని చూస్తున్నాడు. క్రిష్తో వర్క్ చేసేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.