Monday, May 13, 2024
- Advertisement -

ఈ హీరో పవన్ కల్యాణ్ రచ్చలోకి లాగుతున్నాడా!

- Advertisement -

శివాజీ లక్ష్యం స్పష్టంగా అర్థం అవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.

విభజనతో అన్యాయం అయిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో ఊరట కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మరి ఈ డిమాండ్ వరకూ బాగానే ఉంది కానీ.. ఈయన పోరాట పంథా మాత్రం ఎవ్వరికీ అందుబట్టడం లేదు!
ప్రత్యేక హోదా కావాలని అంటాడు.. బీజేపీ నేతలను విమర్శించకూడదని అంటాడు. వెంకయ్య వంటి వారి పేర్లను ఎత్తకూడదని శివాజీ అంటాడు. తెలుగుదేశం పార్టీని కూడా వెనకేసుకు వస్తున్నాడు. మరి ఇలాంటి అంశాల్లో అధికారంలో ఎవరు ఉంటే వారిపై విమర్శలు రావడం సహజమే. విభజన కు కాంగ్రెస్ దోషి అయినప్పుడు.. ప్రత్యేక హోదా దక్కకపోవడానికి బీజేపీనే దోషి అవుతుంది కదా! ఈ లాజిక్ ను మిస్సయ్యాడు శివాజీ.
అయితే ఇప్పుడు శివాజీ ప్రత్యేక హోదా అంశం గురించి చేపట్టిన ధర్నాలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేరును ఎత్తాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆయన చొరవ చూపాలని శివాజీ అంటున్నాడు. అలాగే శివాజీ పవన్ కల్యాణ్ పేరును కూడా రచ్చలోకి లాగడం విశేషం. ఏపీ ప్రత్యేక హోదా సాధనకు పవన్ పోరాడాలని శివాజీ సూచించాడు. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో.. ఆయన అభిమానులు ఏమంటారో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -