Monday, April 29, 2024
- Advertisement -

ఆదిపురుష్ కష్టాలు.. వచ్చే ఏడాది కూడా డౌటే !

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తన కెరియర్ లోనే మొదటిసారిగా ఒక మైథలాజికల్ మూవీలో అది కూడా రాముడిగా నటిస్తుండడంతో ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ తో మూవీ పై ఉన్న అంచనాలు అన్నీ తారుమారు అయ్యాయి. టీజర్ లో ఫెళవమైన గ్రాఫిక్స్ తో కార్టూన్ మూవీలా ఉందంటూ సినీ అభిమానులు చిత్రయూనిట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో మూవీ బెస్ట్ అవుట్ పుట్ కోసం విడుదల తేదీని సంక్రాంతి నుంచి జులై 16 వాయిదా వేశారు. .

అయితే ఇప్పుడు బీ టౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ” ఆది పురుష్ ” వచ్చే ఏడాది జులై లో కూడా విడుదల అయ్యే అవకాశం లేదట. మూవీలో గతంలో చేసిన వి‌ఎఫ్‌ఎక్స్ మొత్తం మార్చుతున్నాట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో మూవీని వచ్చే ఏడాదికి వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి మొదట 500 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. ప్రస్తుతం రీగ్రాఫిక్స్ కారణంగా మరో 200 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందట. ఇక ఈ మద్య విడుదల అయిన హనుమాన్ టీజర్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. కేవలం 25 కోట్ల ఖర్చుతోనే టాప్ క్లాస్ గ్రాఫిక్స్ తో మూవీని తెరకెక్కించారని, ఆది పురుష్ కు 500 ఖర్చు చేసిన బెస్ట్ అవుట్ పుట్ రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మరి మూవీని వాయిదా వేస్తూ అలాగే బడ్జెట్ కూడా విపరీతంగా ఖర్చు చేస్తోన్న ఓంరౌత్ ఫైనల్ అవుట్ ఫుట్ తోనైనా అందరినీ అలరిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

చరణ్ బుచ్చిబాబు మూవీ స్టోరీ ఇదేనా ?

చిరును వెనక్కి నెట్టిన బాలయ్య!

సమ్మర్ హీట్ పెంచుతోన్న స్టార్ హీరోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -