వాణిజ్య ప్రకటనల్లో మెరిసిన వారందరూ సినీ పరిశ్రమలో మెరుస్తుంటారు. అలా వచ్చిన వారిలో హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. సినీ పరిశ్రమలోకి రావాలంటే యాడ్స్ ఒక పునాదిలాగా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణగా ఇప్పుడు ఈ ముచ్చట ఉంది. ‘ఎయిర్టెల్ 4జీ గురించి తెలుసా’ అంటూ ఎయిర్టెల్ ప్రకటనల్లో ఆ మధ్య వరుసగా కనిపించింది. ఊరువాడ, పలు ప్రత్యేక షూట్స్లలో నటించింది సాషా చెత్రి. యాడ్స్లతోనే అందరినీ ఆకట్టుకున్న సాషాకు 19 ఏళ్లు. అయితే ఈ భామ త్వరలో మన తెలుగు సినిమాల్లో కనిపిస్తోంది. దేశం మొత్తం పేరు పొందిన ఈ అమ్మడు తెలుగులో నటించడం గమనార్హం.
సాషా స్వస్థలం ఉత్తరాఖండ్. మోడల్గా, మ్యూజిషియన్గా రాణిస్తోంది. టీవీ కమర్షియల్స్లో నటించిన సాషాకు ఇప్పుడు తెలుగులో ఓ అవకాశం వచ్చింది. ‘వినాయకుడు’, ‘కేరింత’ సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడివి ఈ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందంట. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే సాశా ఈ సినిమా కోసం హైదరాబాద్లో నటనలో శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది. ఎయిర్టెల్ 2015లో 4జీ సేవలకు ప్రచారకర్తగా సాషాను తీసుకుంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా సాశకు అభిమానులు పెరిగిపోయారు. ‘ఎయిర్టెల్ గర్ల్’గా గుర్తింపు పొందుతోంది.