అఖిల్ సినిమాతో ప్లాప్ చూసిన హీరో అక్కినేని అఖిల్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది. అఖిల్ నటన, డాన్స్ అద్భుతంగా ఉన్న సినిమా కథలో దమ్ము లేకపోవడంతో ఆశించినంత విజయం సొంతం చేసుకోలేకపోయింది.
ఇప్పుడు అక్కినేని అభిమానుల ఎదురు చూపు అంత అఖిల్ రెండో సినిమా కోసమే. అఖిల్ కూడా తన రెండో సినిమా చేయడానికి సన్నహాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. అఖిల్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే ఉంటుందని ఇప్పటికే నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పోతే అఖిల్ రెండో సినిమాని ఎవరు డైరెక్ట్ చేయ్యనున్నారు అనే విషయం ఇంక తెలియరాలేదు.
త్రివిక్రామ్, కొరటాల శివ, క్రిష్, తదితర టాప్ డైరెక్టర్స్ అఖిల్ రెండో సినిమాని డైరెక్ట్ చేయ్యబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అఖిల్ రెండో సినిమాని వంశీ పైడిపల్లి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగర్జున ఊపిరి సినిమాలో నటిస్తున్నాడు. ఐతే రీసెంట్ గా ఓ కథ అఖిల్ కోసం నాగర్జునకు చెప్పాడట వంశీ. నాగ్, అఖిల్కు కూడా కథ నచ్చిందట. సో అఖిల్ రెండో సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించే అవకాశం ఉందంటున్నారు.