అక్కినేని ఫ్యామిలీలో 40 కోట్ల మార్క్ అందుకునే తొలి హీరో అవుతాడని భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులకు అఖిల్ అక్కినేని తొలి సినిమా అఖిల్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. రొట్టకొట్టుడు కథతో వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా అఖిల్ ను హీరోగా ఎలివేట్ చేయలేదు సరికదా తనలోని నటున్ని కూడా ప్రేక్షకులకు సరిగ్గా పరిచయం చేయలేకపోయింది.
అలాంటి సమయంలో ఇప్పుడు రెండవ సినిమాను పక్కాగా ప్లాన్ చేయాలని డిసైడ్ అయిన అఖిల్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన యే జవానీ హై దివానీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ సినిమానే ఇదివరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రీమేక్ చేయాలని అనుకున్నా అప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల నో చెప్పాడు.
కరణ్ జోహార్ కూడా తెలుగులో రీమేక్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆపేయగా ఇప్పుడు అఖిల్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. కాగా ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాని ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా నాగార్జున సమక్షంలో మొదలైనట్లు సమాచారం.