2019 ఎన్నికల సమయంలో ఏపీలో ప్రముఖుల బయోపిక్ చిత్రాలు హల్ చేయనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ మీద మూడు బయోపిక్ చిత్రాలు నిర్మానంలో ఉన్నాయి. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో తేజ దర్శకత్వంలో ఒక సినిమా, వర్మ డైరెక్సన్లో లక్ష్మీస్ ఎన్టీఆర్, కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి డైరెక్సన్లో లక్ష్మీస్ వీరగాధ సినిమాలు తెరమీదకు రానున్నాయి. ఇదంతా ఎన్నికల సమయంలో టీడీపీకి మైలేజ్ తీసుకొస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్కు ధీటుగా వైఎస్ఆర్ బయోపిక్ చిత్రం రానుంది. డైరక్టర్ మహి దర్శకత్వం వహించే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే జగన్ను కలసి పర్మీషన్ తీసుకున్నారు. ఈసినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మొదట మమ్ముట్టి, నాగార్జున వంటి పేర్లు ఇప్పటికే వినిపించాయి. ఇంకా కన్నడ, తమిళ, హిందీ నటులను అనేకమందిని పరిశీలిస్తున్నారు.
అయితే వైఎస్ఆర్ పూర్తి జీవిత చిత్రం కాదు. ఆయన లైఫ్ లోని కీలక ఫేజ్ మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తారు. వైఎస్ఆర్ గా నాగార్జున అయితే ఎలా వుంటుంది? అన్న ఆలోచన నిర్మాతలకు వుంది. అయితే నాగార్జునను సన్నిహితుల ద్వారా కదిలిస్తే, ఒకటే కండిషన్ పెడుతున్నాడని తెలుస్తోంది.
వైఎస్ఆర్ పాత్ర ఆనందంగా పోషిస్తాను కానీ, 2019జనరల్ ఎన్నికల ముందు అయితే చేయను అని చెప్పేసాడట. సినిమా ఎన్నికల ముందు రెడీ చేస్తామంటే తాను చేయనని, ఎన్నికల తరువాత అయితే చేయడానికి రెడీ అని నాగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు విడుదల చేస్తే బ్యాడ్ అభిప్రాయాలు వస్తాయని వెనకడుగు వేస్తున్నారంట. ఒక వేల జగన్ మాట్లాడితే మాత్రం నాగ్ తన ఆలోచనను మార్చుకోవచ్చు.