Thursday, May 2, 2024
- Advertisement -

అల్లు అర‌వింద్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప్రిన్స్ మహేశ్ బాబు?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మ‌రో క్రేజీ ప్రొజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది.అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీ మొత్త‌న్ని త‌న వైపుకు తిప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.అర్జున్ రెడ్డి సినిమా చూసిన త‌రువాత సందీప్ రెడ్డిని ఇంటికి పిలిచి మ‌రి అభినందించాడు మ‌హేశ్‌.త‌న స‌రిపోయే క‌థ ఉంటే అత‌నితో సినిమా చేస్తాన‌ని మ‌హేశ్ అప్పట్లోనే ప్ర‌క‌టించాడు.ఈ లోపు మ‌హేశ్ త‌న 25వ సినిమాతో బిజీ అయ్యాడు.ఈ సినిమా త‌రువాత సుకుమార్‌తో మ‌రో సినిమా అనౌన్స్ చేశాడు మ‌హేశ్‌.సందీప్ రెడ్డి వంగా లేద‌ని అంద‌రు అనుకున్నారు.కాని ఈ కాంబినేష‌న్‌ను పట్టాలు ఎక్కిస్తున్నాడు నిర్మాత అల్లు అర‌వింద్‌.

అవును మీరు విన్న‌ది నిజ‌మే….ఇప్ప‌టి వ‌ర‌కు మెగా హీరోల‌తో తప్ప పెద్ద‌గా బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయ‌లేదు అల్లు అర‌వింద్‌.చిన్న హీరోల‌తో కొన్ని సినిమాలు చేశారు కాని,పెద్ద హీరోల‌తో మాత్రం సినిమాల‌ను నిర్మించ‌లేదు.అల్లు అర‌వింద్ ఫ‌స్ట్ టైం ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ప‌డ్డాడు.ఈ సినిమాను చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని అల్లు అర‌వింద్ భావిస్తున్నాడు.ఈ సినిమాలో మ‌హేశ్ మెకానిక్‌గా క‌నిపించ‌నున్నాడని స‌మాచారం. ఈ వార్త నిజం అయితే క‌నుక టాలీవుడ్‌లో చాలా మార్పులు రావ‌డం ఖాయం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -