Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు అరవింద్‌ 1000 కోట్ల సినిమా.. రంగంలోకి త్రివ్రికమ్‌!

- Advertisement -

రామాయణం కథ ఆధారంగా సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ దర్శకుడు ఓం రావత్ ప్రభాస్ తో ఆది పురుష్ కథను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి రామాయణం బ్యాక్ డ్రాప్ లో సినిమాను నిర్మించనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దాదాపు రూ.1000కోట్లతో సినిమాను అత్యంత భారీగా రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారట. సినిమాను రెండు భాగాలుగా నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జనరేషన్ కు నచ్చేలా, రామాయణం ఔన్నత్యం, ఔచిత్యం చెడకుండా సినిమా చేయాలని భావిస్తున్నారు. ఇక ఇంత పెద్ద సినిమాకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ బాధ్యతను స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మీద పెట్టాడట నిర్మాత అల్లు అరవింద్‌.

అరవింద్ కోరిక మేరకు రామాయాణం మొత్తాన్ని మూడు గంటల సినిమా స్క్రిప్ట్ గా మార్చారట మన మాటల మాంత్రికుడు. తెలుగులో డైలాగ్ వెర్షన్ కూడా ఆయనే రాసారట. దీన్ని బేస్ చేసుకుని మిగిలిన స్క్రిప్ట్ లను తయారుచేసుకుంటారు.

రామాయణం సినిమాకు స్టార్ కాస్ట్ నే అతి పెద్ద సవాల్. ఈ విషయంలో టీమ్ చాలా జాగ్రత్తగా, తొందరపడకుండా, వేచి చూసి, తగిన నటులు దొరికిన తరువాతే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అన్ని కుదిరితే ఈ రామాయణం ప్రాజెక్టు వచ్చే ఏడాది సమ్మర్‌లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -