Saturday, April 27, 2024
- Advertisement -

వైజాగ్‌లో పుష్పరాజ్..జననీరాజనం

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇటీవలె రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్‌లో జరగనుంది. దీంతో వైజాగ్‌కు వచ్చిన అల్లు అర్జున్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బన్నీపై పూల వర్షం కురింపడంతో పాటు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. వైజాగ్ పోర్ట్ లో పుష్ప 2 షూటింగ్ జరగనుంది.

పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రోజు రోజుకు హైప్ పెరిగిపోతోంది. ఇక సుకుమార్ సైతం అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా పుష్ప 2 ప్రతీ ఫ్రేమ్‌ని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -