- Advertisement -
దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా శివాని నాగారం హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేసింది.మార్చి 1 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుండగా రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ లో క్రాస్ చేసినట్టుగా ఆహా నిర్వాహకులు తెలిపారు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో తెరకెక్కగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
యువ నటి శరణ్య ప్రదీప్ నటన సినిమాకే హైలైట్గా నిలవగా ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.