నవంబర్ 1న ఇటలీలో మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు.మెగా హీరోలంతా సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఈ వెడ్డింగ్కు హాజరుకానుండటంతో ఫ్యాన్స్కు కన్నుల పండుగ ఖాయం.
ఇక ఇవాళ్టి నుండి నాలుగు రోజుల పాటు ఈ వేడుక కన్నుల విందుగా జరుగనుంది. ఇవాళ రాత్రి సంగీత్ పార్టీ, 31న ఉదయం హల్దీ వేడుకలు, సాయంత్రం మెహందీ వేడుక జరగనుంది. నవంబర్ 1న పెళ్లి వేడుక జరగనుండగా ఈ పెళ్లి వేడుకకు వరుణ్ తేజ్ నాయనమ్మ అంజనా దేవి హాజరుకావడం లేదని సమాచారం.
అంజనా దేవి ఆరోగ్య పరిస్థితి బాలేదు. దీంతో డాక్టర్ల సూచన మేరకు ఇటలీకి వెళ్లడం లేదు. అయితే ఈ పెళ్లిని ప్రత్యేక్షంగా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారట. అయితే నవంబర్ 5న హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు టాలీవుడ్ హీరోలతో పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.