భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పుడు బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ,క్రీడా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్లు రాగా బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాయి. ఇక ముఖ్యంగా దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహానటి తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య పెరిగిపోగా తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఆర్తి..టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. ఎంతవేగంగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగిందో అంతేవేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. చేసింది కొద్ది సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది.
ఓ యంగ్ హీరోతో ప్రేమ, బ్రేకప్తో మానసింగ కుంగిపోయింది. సినిమాలకు దూరమైన తర్వాత లావైన ఆర్తి…లైపో సెక్షన్ ఆపరేషన్ కూడా చేయించుకుంది. కానీ ఆ తర్వాతే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు మృత్యువాతపడ్డారు. ఇక తాజగా ఆమె బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే కథ సిద్ధం చేయగా మరో దర్శకుడు తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారట. ప్రముఖ నిర్మాతలు ఈ బయోపిక్ని నిర్మించనుండగా త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టీ టౌన్ కొడై కూస్తోంది.