Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ ఫాన్స్ కి పీడ కల లాంటి వార్త

- Advertisement -

రామోజీ ఫిల్మ్ సిటీలో బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల్ని తీస్తున్నారు. దాదాపు సినిమాలోని తారాగణమంతా అక్కడే ఉంది. ఒక షాట్ అవ్వగానే ఇప్పుడే వస్తా అంటూ  మహేష్ బాబు తన వ్యానిటీ వ్యాన్ దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడ అప్పటికే ప్రముఖ దర్శకుడు  గుణశేఖర్ సిద్ధంగా ఉన్నాడు.

మహేష్ – గుణ ఇద్దరూ నవ్వుతూ ఒకరినొకరు కరచాలనం చేసుకొని నేరుగా వ్యాన్ లోకి వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి సుమారు 40 నిమిషాలసేపు చర్చించుకొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ బయటికొచ్చారు. మరి గుణశేఖర్… మహేష్ ని కలవడానికి కారణమేంటి? ఇద్దరూ లోపల అంత సేపు ఏం మాట్లాడుకున్నారనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గుణశేఖర్ మహేష్ కి కథ వినిపించాడని అక్కడున్న కొద్దిమంది మాట్లాడుకున్నారు. మరి మహేష్ స్పందనేంటో తెలియ రాలేదు.

ఒకవేళ గుణ కథ చెప్పుంటే అది కచ్చితంగా ప్రతాపరుద్రుడి కథే అయ్యుంటుంది. రుద్రమదేవికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు కథని తెరకెక్కించాలని గుణశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ కథని ఒక స్టార్ కథానాయకుడితో తీయాలనేదే గుణ ఆలోచన.  ఆ పాత్రకి మహేష్ బాగుంటాడని ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఒక్కడు తో పాటు ప్లాప్ అయిన సైనికుడు కూడా గుర్తొస్తుంది మరి. ఫాన్స్ అయితే ఒద్దనే అంటారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -